YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కావలిలో పర్యటించనున్న ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడి

కావలిలో పర్యటించనున్న ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడి

కావలిలో పర్యటించనున్న ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడి
నెల్లూరు
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ నెల 26 వ తేదీ అనగా గురువారం ఉదయం 11 గంటలకు కావలి లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కావలి మండలం మన్నంగిదిన్నె గ్రామంలో...వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద జరుగుతున్న ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు..
100 సంవత్సరాల తర్వాత దేశంలో తొలిసారిగా రాష్ట్రంలోనే భూముల సమగ్ర సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు.భూమిపై చట్టపరమైన హక్కులు,హద్దులు, కొలతలు, విస్తీర్ణం తదితర అంశాలకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మకమైన ఈ పథకం ప్రాముఖ్యత ప్రజలకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిజేస్తారని ఎమ్మెల్యే వివరించారు.
మంత్రి పర్యటన కార్యక్రమంలో రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ లు అభ్యర్థులు పాల్గొనాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు.

Related Posts