YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రామ స్వరాజ్ అభియాన్ రుణాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్ రెడ్డి

గ్రామ స్వరాజ్ అభియాన్ రుణాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా   మొయినాబాద్ మండలం చిల్కూరు మహిళా ప్రగతీ ప్రాంగణంలో గ్రామ స్వరాజ్ అభియాన్ కింద లబ్ధిదారులకు  రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి రూ  24 కోట్ల 40 లక్షల ఆర్ధిక సహాయం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా పరిషత్ సీఈవో రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ అనితా శ్రీహరి, జెడ్పిటీసీ చంద్రలింగం ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. కార్యక్రమంలో భాగంగా 518 మహిళా సంఘాలకు 21 కోట్ల 64 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు మంత్రి అందించారు. ఎస్సీ, ఎస్టీ యువకులకు ఉపాధి కోసం రూ. 1.72 కోట్లతో  వాహనాలు, రైతులకు రూ. 48 లక్షలతో ట్రాక్టర్ లు,  మహిళలకు వంటగ్యాస్ కనెక్షన్ లు పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వికాసంతో పాటు వ్వక్తిగత ఆర్థిక వికాసంతోనే సమాజ అభివృద్ధి వుంటుందని అన్నారు. మహిళా సంక్షేమం, వికాసంతో రాష్ట్రం సంతులిత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మహిళల కోసం  కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, పింఛన్ లు , బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నారు.  రైతులకు పెట్టుబడులు, నిరంతర విద్యుత్ సరఫరా, కొరత లేని ఎరువులు విత్తనాలు, మద్ధతు ధరలు అందిస్తున్నారని అయన అన్నారు. 

Related Posts