తెలంగాణ శాసనసభలో రద్దు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి. ఈ విషయంపై వచ్చిన కోర్టు తీర్పుని స్పీకర్ వెంటనే అమలు చేయాలని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు. కోర్టు తీర్పు అమలుచేయకపోవటం పై దేశవ్యాప్తంగా చర్చకు పెడతామని అన్నారు. గవర్నర్, రాష్ట్రపతిని కలిసి పిర్యాదు చేస్తామని అయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరిగి నీతులు చెప్తున్నారు. ఇక్కడ మాత్రం రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని అయన ఆరోపించారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. కాంగ్రెస్ శ్రేణులు అంతా రైతుల నష్టాన్ని అంచనా వేసి అధికారులకు తెలపండని అయన కోరారు. రైతులకు పరిహారం అందేలా చూడండి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించటం లేదు. ఈ అంశంపై స్పీకర్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు.