ఉపాద్యాయుల బదిలీలపై ఎలాంటి అపోహలు నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తుశుద్దితో వుందని అయన అన్నారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఉపాధ్యాయ సమస్యలను పరీష్కరిస్తున్నాం. పీఆర్సీ విషయం లో కుడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని అయన అన్నారు. సీఎం కేసీఆర్ కు ఉపాధ్యాయుల సంఘాల పై పూర్తి అవగాహన ఉందని అన్నారు. గతంలో చాలా మంది ని వెట్టి చాకిరి చేపించారు. తెలంగాణ వచ్చాక అందరికి జీతాలు పెంచామని అన్నారు. ఉద్యోగుల గూర్చి ఆలోచించి, 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని అయన గుర్తు చేసారు. ప్రజల సేవా చేయడానికి ఉద్యోగులు చేస్తున్న కృషి చాలా గొప్పది. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందని అయన అన్నారు. తెలంగాణ లో ఉద్యోగుల సేవాలు మారువలేనివి. 10 నుంచి రైతు బంధు చెక్ పంపిణీ ఉంది కాబట్టి బదిలీలు అకడమిక్ ఇయర్ లో చేస్తామని అయన వెల్లడించారు.