YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దద్దమ్మ ప్రభుత్వం : ఎమ్మెల్యే రోజా

దద్దమ్మ ప్రభుత్వం : ఎమ్మెల్యే రోజా

గుంటూరు జిల్లా దాచేపల్లి బాలిక రేప్ విషయంలో హోంమంత్రి  చిన రాజప్ప సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నిందితుడిని పట్టుకోలేకపోయారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. చంద్రబాబుకు సి.ఎం అయ్యే అర్హత లేదని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో టిడిపి నేతలు ఉన్నారు. అందుకే ఆ కేసు నీరుగార్చారు.  ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం పై దాడి కేసులో సీఎం సెటిల్మెంట్ చేశారని ఆమె ఆరోపించారు. 55 ఏళ్ళ వృద్ధుడి పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలకు పోలీసుశాఖ రక్షణ ఇవ్వలేకపోతోంది. టీడీపీ నేతలు ఆడవారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆమె అన్నారు. ఆదాయం కోసం ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు పెట్టారు. మా పోరాటం వల్లే చంద్రబాబు స్పందించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. దాచేపల్లి ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు. నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయని ఆమె అన్నారు. 

Related Posts