YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది..  రేవంత్‌ రెడ్డి పై కేటీఆర్ సెటైర్..

చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది..  రేవంత్‌ రెడ్డి పై కేటీఆర్ సెటైర్..

చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది..
     రేవంత్‌ రెడ్డి పై కేటీఆర్ సెటైర్..
హైద‌రాబాద్ ఆగష్టు 27
 తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది అని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి ప్రేలాప‌న‌లకు పాల్ప‌డితే ప్ర‌జ‌లు త‌న్నిత‌రిమేస్తే.. వ‌చ్చి మ‌ల్కాజ్‌గిరిలో ప‌డ్డాడు. ఆయ‌నేదో భార‌త‌దేశానికి ప్ర‌ధాని అయిన‌ట్టు ఫీల‌వుతున్నాడు. ఆయ‌నెవ‌రో.. ఆయ‌న స్థాయి ఏందో.. బ‌తుకు ఏందో అంద‌రికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయ‌న ఏవ‌రి మ‌నిషో కూడా తెలుసు. ఆయ‌న‌ను మాట్లాడించేది ఎవ‌రో తెలుసు. ఆ చిలుక మ‌న‌దే.. కానీ ఇక్క‌డిది కాదు ఆ ప‌లుకు. ఇది నాకే కాదు అంద‌రికీ తెలుసు. చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీని ఫ్రాంచైజ్‌లాగా తీసుకున్నాడు. చంద్ర‌బాబు ఆడించే తొలుబొమ్మ‌లాట‌లో ఆయ‌న ఓ తొలు బొమ్మ‌. మ‌ల్లారెడ్డి అడిగిన‌ట్టు రాజీనామా చేయ‌మ‌ను. ఇదంతా లొల్లి ఎందుకు అని కేటీఆర్ అన్నారు.

Related Posts