YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజా సంగ్రామ యాత్రకు తరలి వెళ్ళిన బిజెపి నాయకులు

ప్రజా సంగ్రామ యాత్రకు తరలి వెళ్ళిన  బిజెపి నాయకులు

మేడ్చల్ 
మేడ్చల్ జిల్లా ఉప్పల్  నియోజకవర్గం  మీర్పేట్ హెచ్ బి కాలనీ నాలుగో డివిజన్ బిజెపి నాయకులు యువమోర్చా నాయకులు బిజెపి రాష్ట్ర నాయకులు ఎనుముల మహేష్ ,మేడ్చల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి మునిగంటి రామ్ ప్రదీప్ ,బి జె పి ఎస్సీ మోర్చా నాయకులు  తాటిపల్లి లింగం ల నేతృత్వంలో  నాలుగో డివిజన్ హెచ్ బి కాలనీ ఫేస్ వన్ చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి కార్లలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఎనుముల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బిజెపి రథసారథులు బండి సంజయ్  నేతృత్వంలో బుధవారం  చార్మినార్ లో ఉన్న మహాలక్ష్మి దేవాలయం నుండి మహా సంగ్రామ యాత్ర మొదలవుతుందని  తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి  టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై సమరాన్ని చేస్తూ,  కేసీఆర్ కుటుంబ పాలనను బొంద  పెడుతుందని హెచ్చరించారు హుజరాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించుకోవడానికి దళిత బందును  ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రజా సంగ్రామ యాత్రకు మీర్పేట్ హెచ్.బి కాలనీ నాలుగో డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు .

Related Posts