YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తప్పుడు కేసులతో పోలీసులు వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు

తప్పుడు కేసులతో పోలీసులు వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు

అమరావతి
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలిపిన తెదేపా నాయకుల పై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ కు  ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి,  నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసారు.   ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని 'వైఎస్ఆర్సిపి అధికార ప్రేరేపిత  పోలీసు రాజ్యం' గా మార్చేసింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న విమర్శ చేసినా ఒక వర్గం పోలీసులు సాధారణ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారు.  తమ అసమ్మతిని తెలియజేసే అమాయక ప్రజలను అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా గృహ నిర్బంధం చేస్తున్నారు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారని అయన లేఖలో పేర్కోన్నారు.
అసమ్మతి వ్యక్తీకరణ అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులలో హామీ ఇవ్వబడిన వాక్ స్వేచ్ఛలో భాగం. ఇది ప్రజాస్వామ్య హక్కు.  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాథమిక హక్కులు మరియు ప్రజాస్వామ్య హక్కులు రెండూ పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి.  ప్రతిపక్ష నాయకులపై వరుస దాడులు చేస్తున్నారు.  అందులో తాజాగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు చింతమనేని ప్రభాకర్ అరెస్టు.   పెట్రోల్, డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడంపై చింతమనేని ప్రభాకర్ నిరసన వ్యక్తం చేసి 2021 ఆగస్టు 28 న  లేఖ ఇచ్చేందుకు దెందులూరు తహశీల్దార్ను కలిశారు.   శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రభాకర్ పై  ఐ.పి.సి సెక్షన్లు కింద తప్పుడు కేసు నమోదు చేశారని అయన అన్నారు.   పైన పేర్కొన్న సెక్షన్లు సరిపోవన్నట్లు  విశాఖపట్నంలో ప్రభాకర్ను అక్రమ అరెస్టు చేశారు.  ఒక విపక్ష పార్టీ నాయకుడిని, మాజీ ఎమ్మెల్యేని ఇంత దుర్మార్గంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి?  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం (తహశీల్దార్) ఆయన చేసిన తప్పా?   పోలీసుల ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు ఏ విధంగా నమోదు చేస్తారు?   నిరసన ద్వారా అసమ్మతిని తెలియజేయడం చట్టవిరుద్ధమా?  ప్రభుత్వంకు చిత్తశుద్ది ఉంటే పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, మునిసిపల్ పన్నులు  తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలి.  పోలీసులు శాంతిభద్రతలను విస్మరించి టిడిపి నాయకులపై తప్పుడు ఫిర్యాదులు చేయడంపై దృష్టి సారిస్తున్నారు.   రాష్ట్రంలో ప్రతీ రోజు హత్యలు,  అత్యాచారాలు జరుగుతున్నాయి.   ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరంతరం భయం, అభద్రతలో జీవిస్తున్నారు.   ప్రజలు ప్రభుత్వ అహంకారపూరిత అప్రజాస్వామిక చర్యలను గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు.   రాబోయే రోజుల్లో పోలీసుల ప్రస్తుత పనితీరు ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోతుంది.   కనీసం ఇకనైనా లా అండ్ ఆర్డర్ వైఫల్యాలను తెలుసుకోవాలని రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.   ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్లో ప్రతిపక్ష నాయకుడిని సభ్యుడిగా చేర్చినప్పటికీ, ఇప్పటి వరకు ఒక సమావేశం కూడా జరగలేదు.  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని నిరూపించకునేందుకు 28 ఆగస్టు 2021 న రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష టిడిపి నాయకులపై నమోదు చేసిన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి.   కనీసం ఇకనైనా పోలీసులు ప్రతిపక్ష టీడీపీ నాయకులను వేధించడం మాని రాష్ట్రంలో నేరాల రేటును నియంత్రించడంపై దృష్టి పెట్టాలని అయన అన్నారు.

Related Posts