YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి అక్రమాలను నిరూపిస్తాం

విజయసాయి అక్రమాలను నిరూపిస్తాం

విజయసాయి అక్రమాలను నిరూపిస్తాం
విశాఖపట్నం
దుష్ట పాలన నుంచి ఒక ప్రాంతాన్ని రక్షించుకోవడానికి దేశంలో తొలిసారిగా సమావేశం నిర్వచిస్తున్నాము. ఉత్తరాంధ్ర జిల్లాలకు దేశంలో ఒక ప్రాముఖ్యత ఉంది. సాగునీరు అందటం లేదు, ఉపాధి లేదు. మేమి సవాల్ చేస్తున్నాము. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు లు ఎవరు కట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు అన్నారు. మేము ప్రాజెక్టులకు ఎంత కర్చుపెట్టము,మీరు ఎంత ఖర్చు పెట్టారో చెర్చిద్దాము రండి. రెండున్నర సంవత్సరాలలో ఇరిగేషన్ బ్రష్టు పట్టింది. ఉత్తరాంధ్ర మంత్రులు యస్ బాస్ అంటూ భజన పరులుగా ఉన్నారు. ఒక మంత్రి పక్కన కూర్చొని,మరొక వ్యక్తి రివ్యూ చేస్తుంటే ఎలా ఉరుకుంటున్నారు. హుద్ హుద్, తిట్లీ తుఫాన్ లు వచ్చిన వారం రోజుల్లో సామాన్య పరిస్థితులు తీసుకువచ్చాము. ఈ ముఖ్యమంత్రికి ఏదీ పట్టదు. విశాఖ చెన్నై ఇండస్ట్రీ కారిడార్ గురించి ఎవరు మాట్లాడరు. అభివృద్ధి చెయ్యలేక మూడు రాజధానులు అంటూ కొత్తపల్లవి అందుకున్నారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ వల్ల కరోనా సమయంలో ఎంతో మేలు జరిగింది. న్యాయస్థానాలు లేకపోతే ప్రభుత్వాన్ని అపలేము. విజయసాయిరెడ్డిని విశాఖలో ఎందుకు పెట్టారు? తీర ప్రాంతాన్ని అంతా విజయసాయిరెడ్డి బంధువులు ఆక్రమించారు. విజయసాయిరెడ్డి అక్రమాలని ఆధారాలతో నిరూపిస్తామని అన్నారు.

Related Posts