YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సెప్టెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన  ఏర్పాట్లను పటిష్టవంతంగా పూర్తి చేయండి జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలి

సెప్టెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన  ఏర్పాట్లను పటిష్టవంతంగా పూర్తి చేయండి జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలి

సెప్టెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన
 ఏర్పాట్లను పటిష్టవంతంగా పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు
కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలి
వేంపల్లి (ఇడుపులపాయ) ఆగస్టు 30
 సెప్టెంబర్ 2న వైఎస్ ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ ప్రణాళిక ప్రకారం పటిష్టంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో... ఆదివారం ఇడుపులపాయలో జేసిలు, అధికారులతో కలిసి ముందస్తు ఏర్పాట్లపై విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. ఇడుపులపాయలో హెలిప్యాడ్, వైయస్సార్ ఘాట్, ముఖ్యమంత్రి నివాసం, ట్రిపుల్ ఐటిలో అతిథి గృహాల వద్ద చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులకు ఆయన పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా హెలిపాడ్ వైఎస్ఆర్ కార్డు ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టంగా పూర్తి చేయాలని అధికారులకు,  పోలీస్ శాఖ వారికి సూచించారు.అలాగే వివిధ అంశాలలో ఆయా శాఖల అధికారులకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా పూర్తిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
     ఈ కార్యక్రమంలో జేసిలు ఎం.గౌతమి, సి.ఎం.సాయికాంత్ వర్మ, హెచ్ఎం.ధ్యానచంద్ర,  ధర్మ చంద్రారెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ యదుభూషణ్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిణి, సమాచార శాఖ ఏడి వేణుగోపాల్ రెడ్డి, డివిజనల్ పిఆర్ఓ పురుషోత్తం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ భరత్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి, విద్యుత్, పంచాయతీ, పీఆర్ శాఖల ఇంజనీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు  తదితరులు పాల్గొన్నారు.

Related Posts