YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కావలి డీఎస్పీ డి. ప్రసాద్ కు అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి

కావలి డీఎస్పీ డి. ప్రసాద్ కు అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి

కావలి డీఎస్పీ డి. ప్రసాద్ కు అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి
నెల్లూరు మా ప్రతినిధి
నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న డి. ప్రసాద్ కు అడిషనల్ ఎస్పీ గా ప్రమోషన్ ఇస్తూ  , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ గా అటు ప్రజలు, ఇటు అధికారులు, ప్రధానంగా పోలీసు శాఖ లో హోం గార్డు నుంచి ఉన్నత అధికారుల వరకు మానవత్వం మూర్తీభవించిన ఆఫీసర్ గా డి. ప్రసాద్ విలక్షణమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. కావలి డీఎస్పీ గా వరుసగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగేలా సమయస్ఫూర్తి గా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. కరోనా కాలంలో, లాక్‌డౌన్ అమలులో ప్రజల శ్రేయోభిలాషులు పోలీసులు అనిపించే విధంగా  సమన్వయ చేసుకోగలి సమర్ధవంతమైన అధికారిగా మన్ననలు పొందారు.కావలి పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల్లో స్నేహశీలి అధికారిగా మన్ననలు పొందిన డీఎస్పీ డి. ప్రసాద్ అడిషనల్ ఎస్పీ గా ప్రమోషన్ రావడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts