YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి వెల్లంపల్లి మైనారిటీల ద్రోహి

మంత్రి వెల్లంపల్లి మైనారిటీల ద్రోహి

విజయవాడ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో సుమారు 50 వేల మైనారిటీ ఓట్లు ఉన్న నేపథ్యంలో మైనారిటీ ఓట్లతో గెలిచి  మంత్రి పదవి చేపట్టిన వెలంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ పరిధిలో మైనారిటీల నాయకత్వాన్ని బలహీనపరుస్తు తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారని  సీనియర్ మైనార్టీ నాయకులు నాగూల్ మీరా మండిపడ్డారు. సుమారు 50 వేల మైనార్టీ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో మైనార్టీలకు ఒక్కటంటే ఒక్క పదవి కూడా ఇవ్వకుండా కాలం వెళ్లబుచ్చుతున్నాడని అయన ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అణగదొక్కే ఎందుకు తీవ్రమైన కుట్రలు పన్నుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిన గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైందని అయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు ఇకనైనా మేల్కొని రాజకీయంగా బలపడాలని కోరారు

Related Posts