YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి

వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం  వైఎస్ జగన్ ఘన నివాళి

ఇడుపులపాయ
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఆయన తనయుడు, సీఎం  వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.  సీఎం  వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజాద్ బాషా, నారాయణ స్వామి, ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్లు కొరుముట్ల శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి  12 వ  వర్ధంతి వేడుకలు
ఎమ్మిగనూరు
పట్టణంలో వైఎస్ఆర్ సర్కిల్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ  ఇంచార్జ్  లక్ష్మీ నారాయణ రెడ్డి, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  ఆశయ సాధన కోసం రాజశేఖర్ రెడ్డి అనేక సేవలు అందించారని అన్నారు. ఆరోగ్యశ్రీ,  ఫీజు  రీయింబర్స్మెంట్ , ఉపాధిహామీలాంటి అనేక పథకాలు రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందని తెలిపారు. డిసిసి ప్రధాన కార్యదర్శికాసిం వలి,  ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్  నాయకులు ఆసిఫ్, తయప్ప తదితరులు పాల్గొన్నారు.

Related Posts