YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాస శ్రేణులు క్రియాశీలకంగా మారాలి

తెరాస శ్రేణులు క్రియాశీలకంగా మారాలి

సిద్దిపేట
రేవంత్ పిసిసి, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం కేసీఆరే అని  ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టి ఆర్ ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఏప్రిల్ 27నా కరోనా వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోలేక పోయాం. రేపటి నుండి గ్రామ, పట్టణ, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది కాబట్టి కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.  గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులని.... మీరు చేయాల్సింది  పాదయాత్రలు కాదు...   పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లను ఉద్దేశించి అన్నారు.  సాగునీరు, త్రాగునీరు, కరెంట్,రైతుబందూ, రైతు భీమా అనేక రంగాలలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

Related Posts