YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలి

బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలి

బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలి
వికారాబాద్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, వికారాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపద్యంలో వికారాబాద్ బృంగి  కళాశాలలో పార్టీ నాయకులతో కలసి మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్  కుటుంబ పాలన కొనసాగుతుందని గత ఏడేళ్లుగా కెసిఆర్ తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని దళిత గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించే ది బిజెపి ప్రభుత్వమేనని అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కు సంబంధించిన రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. మన్నెగూడ లో జరిగే భారీ బహిరంగ సభకు డీకే అరుణ హాజరవుతారు.  వికారాబాద్ లో జరిగే బహిరంగ సభకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతారు.  మోమిన్పేట్ లో జరిగే బహిరంగ సభకు ఓబీసీ  యువ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శివరాజ్, జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి రాజేందర్ రెడ్డి  విజయేందర్ రెడ్డి, మరాఠి శివప్రసాద్, శేఖర్ రెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts