YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వృద్ధులకు పౌష్టికాహారం అందించిన కేజీఎన్ క్యాటరింగ్ యాజమాన్యం

వృద్ధులకు పౌష్టికాహారం అందించిన కేజీఎన్ క్యాటరింగ్ యాజమాన్యం

వృద్ధులకు పౌష్టికాహారం అందించిన కేజీఎన్ క్యాటరింగ్ యాజమాన్యం
నెల్లూరు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 13 వ  వర్ధంతి  సందర్భముగా కే జి ఎన్ కేటరింగ్ ప్రొప్రైటర్   రఫీ ఆధ్వర్యములో గురువారం  గీతమయి వృద్ధాశ్రమము నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే పౌష్టిక ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్. చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమ, అభివృద్ధి సేవల గురించి వివరించారు .ఈ కార్యక్రమములో నూరుబాషా సంఘం  జిల్లా అధ్యక్షులు షేక్ సలీమ్  ,నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్  వాలి  , రాజా , సాయి పాల్గొన్నారు. ఈ సందర్భముగా రఫీ మాట్లాడుతూ డాక్టర్ వై ఏస్ రాజశేఖర్   రెడ్డి ప్రవేశ  పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 2004 లో  బొల్లినేని హాస్పిటల్   నందు ఆపరేషన్ చేసుకున్నానని తెలియ చేశారు .తనలా ఎంతోమంది పేదలకు ప్రాణాలు నిలబెట్టిన పథకం అని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టిన మహానేత వై.ఎస్.అర్ అని ప్రశంసించారు

Related Posts