YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదు.

తెలంగాణ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదు.

తెలంగాణ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదు.
హైదరాబాద్
కేసీఆర్ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే బాధకల్గుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ నదీ జలాలు దోపిడీ చేస్తుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. నీటిపారుదల అధికారులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి అన్నారు. శుక్రవారంఅయన మీడియాతో మాట్లాడారు. పనికిమాలిన అధికారులు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్  జలవిద్యుత్ కోసమే అంటూ అధికారులు చెప్పడం సిగ్గుచేటు. కృష్ణా నది లో 574.6 టిఎంసి ల వాటా తెలంగాణకు ఉంది. కేసీఆర్ కు లిఫ్ట్ ప్రాజెక్ట్ ల పైనే దృష్టి .. లిఫ్టులు కట్టాలి కమీషన్లు తీసుకోవాలి అనేదే ధ్యాస. రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల పేరుతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.  కేఆర్ఎంబీ సమావేశంలో ఆంధ్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ ల గురించి ఎందుకు మాట్లాడలేదు. ఆంధ్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ ల పై సుప్రీం కు వెళ్లాలని కేసీఆర్ కు ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోరు. ఒక బేసిన్ నీళ్లు మరో బేసిన్ కు తీసుకెళ్లేందుకు చట్టం ఒప్పుకోదు. ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనమే కొనసాగుతోంది. కేసీఆర్ ఆంధ్ర నాయకులకు,కాంట్రాక్టర్లకు దాసోహం అంటున్నారు. ప్రతిరోజూ పోతిరెడ్డిపాడు నుంచి 7 టిఎంసి ల నీళ్లు ఆంధ్రకు పోతున్నాయి. కేసీఆర్ ఢిల్లీలో మోదీ అమిత్ షా లను కలుస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. కేసీఆర్ స్వంత ప్రయోజనాల కోసమే డిల్లీ టూర్. సంగేశ్వర ప్రాజెక్ట్ పుట్టిందే ప్రగతి భవన్ లో .. దానికి పేరు పెట్టిందే కేసీఆర్. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సంగేశ్వరం వద్ద పనులను ఆపాలి. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ లే .. కేసీఆర్ కట్టినవి ఏమున్నవి. కాళేశ్వరం నుంచి ఒక్క ఏకరాకన్నా నీళ్లు పారినవా ..
కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు .. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. కేసీఆర్ వల్ల ఇద్దరు కాంట్రాక్టర్లు దేశంలోనే సంపన్నులు అయ్యారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఏకటాటి పైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని నాగం అన్నారు.

Related Posts