YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజిలెన్స్ విచారణ వేగం

విజిలెన్స్ విచారణ వేగం

విశాఖపట్టణం, సెప్టెంబర్ 4, 
అన్యాక్రాంతం అయిన సింహాచలం భూములపై ప్రభుత్వం దూకుడు పెంచింది. బాధ్యులైన సూత్రధారులు, పాత్రధారుల లెక్కలు బయటపెట్టేందుకు విజిలెన్స్ విచారణ వేగవంతం అయ్యింది. 2016-2017లో దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి 862 ఎకరాలు తొలగించినట్లు దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ గుర్తించి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రాప ర్టీ రిజిస్టర్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 10వేల కోట్ల రూపాయలనేది ఓ వాదన. దీంతో దేవుడి సొమ్మును కొల్లగొట్టిన వా రిని ఆధారాలతో సహా పట్టించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే 862ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో క్రయ విక్రయాలు జరిపే వీలు లేదు. ఇప్పటికే ఈ భూములు చేతులు మారిపోగా…చాలా అపార్ట్ మెంట్లు, భవనాలు, లే అవుట్లు పుట్టుకొచ్చాయి.బీఆర్టీఎస్‌కు ఆను కుని సింహాచలం, వేపగుంట ప్రాంతాల్లో కొత్తకొత్త అపార్ట్ మెంట్లు నిర్మాణం కాగా… వీటిలో చాలా భాగం దేవస్థానం భూముల వివాదంలో ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు చేసేప్పుడు జాగ్రత్త లు పాటించకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. సింహచలం దేవస్థానానికి చెందిన భూములు ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారనేది నిర్ధారణ అయింది. అయితే వీటిని ఎందుకు, ఎవరికి కేటాయించారనేది లెక్క తేలాల్సి ఉంది. అదే సమయంలో అధికార పరిధిని దాటి అప్పటి ఈవో రామ చంద్ర మోహన్, అసిస్టెంట్ కమిషనర్ సుజాత పనిచేశారని తేలడంతో వేటు వేసింది ప్రభుత్వం. విజిలెన్స్ విచారణలో మరింత మంది బండారం బయటపడే అవకాశం ఉంది. ఇదే సమయంలో 862 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం అక్రమార్కులకు కునుకు లేకుండా చేస్తోంది.

Related Posts