YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది తెలంగాణ ప్రజల పార్టీ

 ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం  విఫలమైంది తెలంగాణ ప్రజల పార్టీ

హైదరాబాద్

తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర సర్వ సభ సమావేశం వనస్థలిపురం ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్  గుప్తా మాట్లాడుతూ.....
ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం,న్యాయం, ఉపాధి లక్ష్యంగా తెలంగాణ ప్రజల పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని అన్నారు. నాయకులు ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అని ఆస్తులు పెంచుకుంటున్నారని అన్నారు. సమాజంలో పెరుగుతున్న అంతరాలను తగ్గించి సమసమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రజల పార్టీ పని చేస్తుందని అన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో అవినీతి కుటుంబ పాలన రాజ్యమేలుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజల పార్టీకి సంబంధించిన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts