YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కులాల మధ్య చిచ్చు పెడ్తూ లబ్ది పొందుతున్న కేసీఆర్. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

 కులాల మధ్య చిచ్చు పెడ్తూ లబ్ది పొందుతున్న కేసీఆర్. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

 కులాల మధ్య చిచ్చు పెడ్తూ లబ్ది పొందుతున్న కేసీఆర్
     టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
జగిత్యాల సెప్టెంబర్ 6
కులాల మధ్య చిచ్చు పెడ్తూ కేసీఆర్: లబ్ది పొందుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు జీవన్ రెడ్డి  తో పాటు మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన ఈ ప్రాంతానికి జీవితాంతం రుణపడి ఉంటాను. మా అందరికి రాజకీయ మార్గదర్శి జీవన్ రెడ్డి...నిజమైన బంధువు అంటే జీవన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి.మన కొడుకులు, బిడ్డలు ఉద్యోగం ఏమైంది. 3 ఎకరాలు ఇచ్చి ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర గౌరవంగా సుమారు 60 లక్షలు ఉండేవి. డబుల్ బెడ్రూంలు ఇండ్లు రాలేదు కానీ 150కోట్ల తో కవితమ్మ బంగ్లా కట్టుకుంది. ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమైనయి.? దళిత గిరిజన బహుజనులు అందరిని ఈ కేసీఆర్ జీవితాంతం మోసం చేద్దామని అనుకుంటున్నాడన్నారు. కరీంనగర్ సిరిసిల్ల వేదికగా పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుంది. కేజీ టు పిజి ఉచిత విద్య ఏమైంది. ? ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారూ. ప్రతి దళిత కుటుంబానికి, గిరిజన తాండలకు వెళ్తూ , జై బీమ్, సేవాలాల్, రాం రాం అంటూ అందరిని చైనతన్య పరచాలని పిలుపు నిచ్చారు. మిషన్ భగీరథ కమిషన్ భగీరథ అయింది. మోడీ గారి కళ్ళ మీద పడి వేడుకున్నాడు హుజురాబాద్ ఉప ఎన్నికలు వాయిదా వేయమని. ఈటెల రాజేందర్ బిజెపిలో చేరి ఇప్పుడు ఏమిచేయలేక బాధపడుతున్నాడు. గుండు ఎంపీ పసుపు బోర్డ్ అని ప్రజలను మోసం చేస్తున్నాడు....నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ఘనత వీళ్ళది. రబ్బర్ చెప్పులు వేసుకున్న నాయకులకు నేడు వందల ఎకరాలు ఫార్మ్ హౌస్ లు ఎట్లా వచ్చినై. చెట్ల సంతోష్ 50 రూపాలా చెట్టును 500కు అమ్ముకుని దందా చేస్తుండని దుయ్యబట్టారు. ఇందిరా గాంధీ గారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు....రాజీవ్ గాంధీ గారి వల్లనే నేడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. జగిత్యాల జిల్లా కి తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద చరిత్ర ఉన్నది. అందరూ తెలంగాణ భవిషత్తు కోసం ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. పెట్రోల్ డీజల్ ధరలు పెంచుతూ ప్రజలను దోచుకతింటున్నారు. తెలంగాణ వచ్చాక ఒక్క సమావేశం కూడా ఆరోగ్యం పైన పెట్టలేదు ఈ ప్రభుత్వం. జీవన్ రెడ్డి గారి ప్రోథబలంతో ఈ ప్రాంతనికి నర్సరీ మరియు డిప్లొమా కాలేజి తెచ్చుకోగలిగాము. ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది జీవన్ రెడ్డి గారు మంత్రి గా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని. ఒక తల్లిగా... ఏ ఓక్క బిడ్డ ప్రాణం పోవద్దు అని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్టాన్ని ఇచ్చారు...కానీ తెచ్చుకున్న తెలంగాణను రాబందులు కుటుంబం దోచుకతింటుంది.కృష్ణ నీలను ఆంధ్ర అక్రమంగా దోచుకపోతుంటే ఈ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడంలేదు.?అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకుంది గొర్లకు బర్లకు సన్న బియ్యానికి  నల్లనీళ్ల కోసం కాదు....ఉద్యోగం, పిల్లల భవిషత్తు బాగుండాలని తెచుకున్నాం. రాజకీయాలలో ఎదగలనుకునేవారందరికి జీవన్ రెడ్డి ఒక ఆదర్శం...కరోనా వచ్చిన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జగిత్యాల ప్రజలకు జీవన్ రెడ్డి సేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎవరిని వదిలేదిలేదు. గమ్యం లేని బండి ఎందుకు ఈ పాదయాత్ర...మతం పేరుతో రెచ్చకొడ్తున్నారు...కరోనా టైంలో నరేంద్ర మోడీ నియోజకవర్గంలో పవిత్ర గంగా నదిలో శవాలు తెలినాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి కూడా లేకపోయింది. ఈ రెండు అరాచక పార్టీలను గద్దె దించేందుకు తెలంగాణ బిడ్డలు  తెగువ చూపాలి.మహాకవి కాళోజి ఒక్కటే అన్నారు. ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమెరదాక తరమికొట్టండి.. ‘ప్రాంతం వాడే మోసం చేస్తే ఇదే ప్రాంతంలో పాతర పెట్టండి..’అన్నాడు. దళితులను ఏడేళ్లుగా మోసం చేస్తూ నష్టం చేస్తూ మాయమాటలు చెప్పి లబ్ది పొందుతున్న కేసీఆర్ దళితులకు ఎలా బరువు అవుతారని ఆయన దళిత శత్రువని ఈ విషయాన్ని దళితులందరు అర్థం చేసుకొని కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.

Related Posts