YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హుజురాబాద్ లో కాంగ్రెస్ చిచ్చు

హుజురాబాద్ లో కాంగ్రెస్ చిచ్చు

కరీంనగర్, సెప్టెంబర్ 8, 
తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. మొద‌టి నుంచి ఇక్క‌డే టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు ఓ రేంజ్‌లో ప్ర‌చారం చేస్తూ ఇప్ప‌టికీ అన్ని ఊర్ల‌ను చుట్టేస్తున్నాయి. అంతే కాదు ఇప్ట‌పికే ఇరు పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి స‌మావేశాలు, స‌భ‌లు, ప్రచారాల‌తో దూసుకుపోతున్నాయి. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు క్యాండిడేట్ ను కూడా అనౌన్స్ చేసుకోలేక సైలెంట్ గా ఉంది. చాలామంది పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చినా ఎవ‌రికీ టికెట్ ద‌క్క‌ట్లేదు. మాజీ మంత్రి కొండా సురేఖకు ఇస్తార‌నే ప్ర‌చారం బాగా సాగినా చివ‌ర‌కు ఆమెకు కూడా ఇవ్వ‌కుండా ఆసక్తి ఉన్న నేతలు గాంధీ భ‌వ‌న్‌లో దరఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు. ఇక ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు తేదీ మొన్నటి ఆదివారంతో అయిపోయింది. దీంతో ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డింది. అదేంటంటే కొండా సురేఖ మాత్రం ఇందులో ద‌ర‌ఖాస్తు చేసుకోలేదు. హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ఏకంగా పద్దెనిమిది మంది అప్లికేషన్ పంపారు. ఇంతకీ, వాళ్లెవరో, ఆ కథేంటో ఒకసారి చదవండి.. తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉపఎన్నిక కాకరేపుతోంది. తెలంగాణ రాజకీయం మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పబోతుందన్న అంచనాలు ఉన్నాయి. హుజురాబాద్ కేంద్రంగానే అధికారానికి బాటలు వేసుకోవాలని కమలదళం భావిస్తోంది. అందుకే, రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలంతా హుజురాబాద్ పైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇక, అధికార టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ముందుకెళ్తోంది. హుజురాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రూపాల్లో వరాల జుల్లు కురిపిస్తోంది. ఇక, మిగిలింది కాంగ్రెస్. అయితే, ఎప్పటిలాగే కాంగ్రెస్ లో డైలమా కంటిన్యూ అవుతోంది. బీజేపీ అభ్యర్ధి ఎవరో తెలుసు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరో కూడా తేలిపోయింది. కానీ, ఇప్పటివరకు తమ అభ్యర్ధిని ప్రకటించలేని స్థితిలో కాంగ్రెస్ మిగిలిపోయింది. అసలు, హుజురాబాద్ బరిలోకి దిగడానికి ముఖ్యనేతలెవరూ ముందుకు రాలేదన్నది పార్టీ వర్గాల టాక్. ఒకరిద్దరు పేర్లు వినిపించినా మెయిన్ లీడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో, హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక కోసం ప్రకటన జారీ చేసింది టీపీసీసీ.18 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 11 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు అయితే మిగ‌తా ఏడుగురు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వారివి. అయితే ఇందులో ఏ ఒక్క‌రు కూడా టీఆర్ఎస్‌, బీజేపీ అబ్య‌ర్థుల‌కు పోటీ ఇచ్చే స్థాయి లేరంట‌. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. కొండా సురేఖకు ఇవ్వాల‌ని భావిస్తున్న అధిష్టానం ఆలోచ‌న‌ను ఆమె సీరియ‌స్ గా తీసుకోలేద‌ని అందుకే ద‌ర‌ఖాస్తు చేసుకోలేద‌ని తెలుస్తోంది. ఇక ఆమెకు కాకుండా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వ‌లేని ప‌రిస్థితి. అలాగ‌ని నేరుగా సురేఖ‌కు ఇస్తే ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి నుంచి ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి దరఖాస్తు గడువు పెంచేసి అప్పుడు ఎలాగోలా సురేఖ‌ను బుజ్జిగించి దరఖాస్తు చేయించి ఆమెకు టికెట్ ఇవ్వాల‌ని అధిష్టానం ఆలోచిస్తోంది. చూడాలి మ‌రి ఆమె ద‌ర‌ఖాస్తు చేస్తారో లేదో.

Related Posts