YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తాండూరు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

తాండూరు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

తాండూరు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ ఆకస్మిక తనిఖీలు… పనితీరు మార్చుకోవాలని సిబ్బందికి హితవు
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గురువారం  ఉదయం 5 గంటలకు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ అధికారులతో కలిసి శానిటేషన్ పై ఎమ్మెల్యే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శానిటేషన్ సిబ్బంది హాజరు ఎమ్మెల్యే స్వయంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్యంపై సిబ్బందికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఇది ఇలా ఉండగా ఇటీవల గల్లీ గల్లికి ఎమ్మెల్యే పేరుతో వార్డుల్లో తిరిగిన ఎమ్మెల్యే రూటు మార్చి  ఆకస్మిక పర్యటన లకు శ్రీకారం చుట్టారు.వచ్చే వారం మళ్ళీ వస్తానని పనితీరును గమనిస్తానని,, తీరు మార్చుకోని సిబ్బందిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఆర్డీవో అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బందిని ప్రక్షాళన చేసి ఆయా వార్డులకు కేటాయించడం జరుగుతుందని ఆ వార్డులో కేటాయించిన సిబ్బంది పేర్లను వారి ఫోన్ నెంబర్లను స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఎమ్మెల్యే వెంట ఆర్డిఓ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts