YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళితులు అందరికీ దళిత బంధు ఇవ్వాలి

దళితులు అందరికీ దళిత  బంధు ఇవ్వాలి

రంగారెడ్డి
దళిత, గిరిజ ఆత్మగౌరవ దండోరా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా దళితుల అందరికీ దళిత బంధు ఇవ్వాలని మీర్ పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామీడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తే మహేశ్వరం నియోజక వర్గ అభివృద్ధి తో పాటు దళితులు అందరికీ దళిత బంధు వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవాకులు  చెవాకులు పేలుచుతున్నరు అని మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి అవినీతి,అక్రమాల పై వారం రోజులలో బహిరంగ చర్చకు సిద్ధమ అని స్వామిడి గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హామీలన్నీ మోసపూరితమైన హామీలే  అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts