YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ కు రాబిస్ వ్యాధి సోకింది

రేవంత్ కు రాబిస్ వ్యాధి సోకింది

హైదరాబాద్
ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి శుభాకాంక్షలు. చంద్రబాబు పెంచిన లిల్లీ ఫుట్ రేవంత్ రెడ్డి. రేవంత్ కు రాబిస్ వ్యాధి సోకింది.  ప్రధాని మోడీ ని సీఎం కెసిఆర్ కలవడం మీద రేవంత్ అడ్డమైన రాజకీయం చేస్తున్నారని  పీయూసీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఏ .జీవన్ రెడ్డి విమర్శంచారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఫెడరల్ స్ఫూర్తి గురించి రాజ్యాంగం లో 263 ఆర్టికల్ స్పష్టం గా చెబుతోంది. రాజకీయ పరిపక్వత లేని రేవంత్ కు రాష్ట్ర ప్రయోజనాల గురించి కెసిఆర్ మోడీ ని కలిస్తే మంచి కనిపిస్తుందా ? పన్నెండు అంశాల పై కెసిఆర్ మోడీ కి వినతి పత్రాలు ఇచ్చారు. యూపీ ఎంఐఎం సీట్ల గురించి వారిద్దరూ మాట్లాడుకుంటారా ? పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఈ నెల పదకొండునే పీఎం మోడీ ని కలిశారు. కాంగ్రెస్ టిక్కెట్ల గురించి ఆయన మోడీ తో చర్చించారా ? .చైనా రాయబారి ని రాహుల్ గాంధీ చాలా సార్లు కలిశారు ...దేశ ద్రోహానికి పాల్పడ్డారా ? ఎమ్మెల్యే సీతక్క ను చంద్రబాబు దగ్గరకు రేవంత్ పంపారు ..కాంగ్రెస్ టిక్కెట్లు నిర్ణయించడానికి పంపారా ? మమత బెనర్జీ మోడీ తో భీకరంగా పోరాడారు ..ఆమె మోడీ ని కలవలేదా ? రేవంత్ గోబెల్స్ ను మించి పోయారు. గాంధీ భవన్ ను గాసిప్స్ అడ్డా గా మార్చాడని అన్నారు. సోషల్ మీడియా లో తన చెంచాల ద్వారా అబద్దాలు ప్రచారం చేయిస్తున్నాడు. .రేవంత్ సినిమా ల్లో ఐటెం సాంగ్ లాంటోడు. మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంటే ...రేవంత్ సోషల్ మీడియా ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఎంఐఎం మతతత్వం గురించి మాట్లాడుతున్నావ్ ..కేరళలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ మిత్రపక్షం అది మతతత్వ పార్టీ కాదా ? శివసేన మతతత్వ పార్టీ కాదా ?ఆ పార్టీ తో కాంగ్రెస్ ఎందుకు అధికారాన్ని పంచుకుంటోంది ? ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ని ,రాజీవ్ గాంధీ కలవలేదా ? .రాహుల్ గాంధీ మోడీ ని పార్లమెంటు లో కౌగలించుకుని ముద్దులు పెట్టలేదా ?బీజేపీ తో కుమ్మక్కయ్యారా ? మన్మోహన్ సింగ్ కూడా మోడీ ని కలుస్తారు ..కాంగ్రెస్ ను బీజేపీ కి అమ్మేశారా ? పీసీసీ ప్రెసిడెంట్ పదవి రాగానే సరిపోదు ..కొద్దిగా రాజకీయ పరిణతి పెంచుకో. .రేవంత్ రాబిస్ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలో మాకు తెలుసు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రేవంత్ కు రాజకీయంగా పుట్టగతులుండవని అన్నారు.
ఎంపీ తేజస్వీ సూర్య మా సీఎం ను తిట్టినా మా మంత్రి కె టీ ఆర్ ఆయనకు జ్ఞాపిక ఇచ్చారు ..ఇదే సంస్కారం. శరద్ పవార్ రాహుల్ సోనియా లను కలిసిన తర్వాత మోడీ ని కలుస్తారు ..ఆ తర్వాత మోడీ ని కలుస్తారు. పవార్ కూడా తప్పు చేస్తున్నారా ? చిల్లర రాజకీయాలు రేవంత్ మానుకోవలని అయన అన్నారు.

Related Posts