YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోర్టులతో చెప్పించుకోకూడదు

కోర్టులతో చెప్పించుకోకూడదు

విశాఖపట్నం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని అనువంశిక ధర్మకర్త చైర్ పర్సన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో అయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం  అయన మీడియాతో మాట్లాడుతూ నన్ను జైలుకు పంపిస్తా జైలు పంపిస్తానని  ప్రభుత్వం లో ఉన్న ముద్దుబిడ్డ లే చెపుతున్నారు. మహాత్మాగాంధీ జైలుకెళ్లాడు జగన్ మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళాడు ఒకరు మంచి కోసం వెళ్తే ఒకరు చెడు కోసం వెళ్లారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అన్ని మతాలు సమానంగా చూడాలన్నారు. పదే పదే కోర్టులతో చెప్పించు కోకూడదున్నారు. రామతీర్థ లలో  కెమెరాలు పెట్టలేదని చైర్మన్ పదవిని తొలగించారు. మూడు దేవాలయాలు నుండి నన్ను చైర్మన్ పదవి నుంచి తొలగించారు ఇప్పుడు కొత్తగా జీవో కాఫీలు నెట్ లో పెట్టడం మానేశారు. వాహన మిత్ర పథకం మంచిదే కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులు మళ్లించడం మంచిది కాదన్నారు

Related Posts