YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హైకోర్టులో రాజధాని అసైన్డ్ రైతులకు ఊరట

హైకోర్టులో రాజధాని అసైన్డ్ రైతులకు ఊరట

అమరావతి
హైకోర్టులో రాజధాని అసైన్డ్ రైతులకు ఊరట కలిగింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో 316పై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. న్యాయవాది ఇంద్రనీల్బాబు  జీవో 316ను హైకోర్టులో సవాల్ చేసారు.  నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు జోవో ఇచ్చారని అయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో విధించింది. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎంఆర్డీఏకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related Posts