YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాస సర్కార్ రైతు పక్షపాతి

తెరాస సర్కార్ రైతు పక్షపాతి

సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పట్టణంలో ఏర్పాటు చేసిన రైతుబంధు అవగాహన సదస్సు లో భాగంగా ఐదు మండలాల లబ్ది దారులకు 36 ట్రాక్టర్లు, ఒక వరి కోత యంత్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి అందించారు. ఈ సంధర్బంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని రైతుల సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని తెలిపాడు. ఇది వరకు ఉన్న ప్రభుత్వాలు ఎలక్షన్ మానిపేస్టో లో ఉన్న  కూడా నెరవేర్చలేరని అన్నారు. తెరాస ప్రభుత్వం మేనిఫెస్టో లో లేని చాల రకాల పథకాలను పేదలకు అందిస్తుందని, రైతుబంధు పథకం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు 4వేల పెట్టుబడిని మన ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ నెల 10 తేదీ నుండి 17 తేదీ వరకు ప్రతి గ్రామంలో ఆహారం, నీటి సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఈ చెక్ లు,  పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. 

Related Posts