YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ రైతు రాజకీయాలకు రేడీ అవుతోంది మంత్రి కన్నబాబు

టీడీపీ రైతు రాజకీయాలకు రేడీ అవుతోంది మంత్రి కన్నబాబు

టీడీపీ రైతు రాజకీయాలకు రేడీ అవుతోంది
మంత్రి కన్నబాబు
కాకినాడ
రైతులను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయడానికి టిడిపి సిద్దమౌతుందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. రైతులకోసం తెలుగు దేశం కాదు.రైతుల మోసం  చేసే తెలుగు దేశం అంటే బాగుంటుంది. 14 సంవత్సరాలుగా గుర్తు రాని రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా. ప్పుడు రైతులకోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర మీది. 80 వేలకోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన చరిత్ర మీది. మీరు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మీరేమి చేసారు. 10780 ఆర్బీకేలు లు రైతులకోసం పనిచేస్తున్నాయి. కొబ్బరి రైతులకోసం మీరెప్పుడైనా ఆలోచించారా. కేంద్రం తో సంబంధం లేకుండా ఏడు రకాల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు దరలు ప్రకటించిన విషయం మీకు తెలుసా. చంద్రబాబు ను చూస్తుంటే 70 ఏళ్ల అబద్దం నడిచి వచ్చినట్లుంది. మీరు అధికారం లో ఉండగా ఇన్పుట్ సబ్సిడీ ఎంత బకాయి పెట్టారో మీకు తెలుసా. ఈ క్రాఫ్ లో పంట నమోదు చేసుకుంటే చాలు ఇన్సురెన్స్ వర్తించే విధంగా చేసాం. మీరు వదిలేసిన 384 కోట్ల విత్తన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించింది. మీ హయాంలో ఎప్పుడైనా కౌలు రైతులకు సహాయం చేసారా. రెండేళ్ల కాలంలో ఆక్వా రైతులకు 1560 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్సిడీ ఇచ్చామని అన్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రుల శాఖల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయనకేం తెలుసు ఆయనేమైనా శాస్తవేత్తనా. 60లక్షల మంది రైతులను మాత్రమే మీ పాలన లో నమోదు చేసారు  అప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతులు ఇంతేనా. ఈ ప్రభుత్వం  1కోటి 20లక్షల పైబడి రైతుల నమోదు చేసామని అన్నారు.
ఒకప్పుడు విత్తనాలు కావాలంటే రైతు లు క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు కూడా తినవలసి వచ్చెది. తెలుగు దేశం ప్రభుత్వం 773  మంది రైతుల సూసైడ్ కేసులను మూసివేసింది. ఈ ప్రభుత్వం లో రెండేళ్ల కాలంలో 23 మంది రైతుల ఆత్మహత్యలు మాత్రమే జరిగాయి. బొండాలు రకాలు వరి పండించవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.దీనిపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.

Related Posts