సివిల్స్ టాపర్ దురిశెట్టి అనుదీప్ నిజమాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిశారు. కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, తన పేరెంట్స్ తో అనుదీప్ ఎంపి కవితను కలిశారు. ఈ సందర్భంగా అనుదీప్ ను ఎంపి కవిత అభినందించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి తెలంగాణ పేరు ప్రఖ్యాతులను మరింత పెంచారని ప్రశంసించారు. సివిల్స్ టాపర్ అనుదీప్, బాక్సర్ లు అసాముద్దీన్, నిఖత్ జరీన్ లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారు కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. వారి ప్రతిభాసామర్ధ్యాలు మిగతా వారికి స్పూర్తినిస్తాయన్నారు.