YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫెర్పాండజ్ కన్నుమూత

ఫెర్పాండజ్ కన్నుమూత

ఫెర్పాండజ్ కన్నుమూత
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13, 
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు ఆస్కార్ ఫెర్నాండెస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల ఆస్కార్ ఫెర్నాండెజ్ గత జూలై నుంచి కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఎనెపోయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు డయాలసిస్ చికిత్స చేస్తుండగా ఓసారి బాగా తలనొప్పి రావడంతో ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు శరీర అంతర్గత అవయవాల్లో గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏడాది జూలైలో తన ఇంటి వద్ద యోగా చేస్తున్నప్పుడు ఫెర్నాండెజ్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. అతని మెదడులోని గడ్డను తొలగించడానికి శస్త్రచికిత్స తర్వాత ఐసియులో చేర్చారు. దీనికి చికిత్స తీసుకుంటుండగా ఆయన కన్నుమూశారు.

Related Posts