YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు మతి భ్రమించింది

చంద్రబాబుకు మతి భ్రమించింది

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చేపడుతున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడుకు మతిభ్రమించిందని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎం ఎస్ బాబు విమర్శించారు.  తవణంపల్లి మండలం దిగువ తడకర  గ్రామంలో నాడు-నేడు కార్యక్రమంలో  పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్పిటిసి అభ్యర్థి భారతి మధు కుమార్ ఆధ్వర్యంలో అడుగడుగునా మహిళలు ఎమ్మెల్యే కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే నన్నారు .   రైతుల్లో వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు నాయుడు  ఓర్వలేక  ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.... ఎప్పుడు లేని ప్రేమ రైతులపై ఎందుకు పుట్టుకొచ్చిందో  కారణం చెప్పాలన్నారు. వైయస్సార్ సిపి అంటేనే రైతుల పార్టీని అందరికీ   తెలిసిందేనని గుర్తుచేశారు... చంద్రబాబునాయుడు ఎన్ని కుయుక్తులు చేసినా రైతులు నమ్మే పరిస్థితిలో లేరని ఆరోపించారు.. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ వారికి అన్ని విధాలుగా అండగ నిలుస్తున్నారని   తెలిపారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఎల్లవేళల వారికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు . ఈ కార్యక్రమంలో తవణపల్లె  మండలం వైఎస్ఆర్సిపి కన్వీనర్ పట్నం ప్రతాప్ రెడ్డి, గాంధీ బాబు ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పమేశ్వర్ రెడ్డి ,జొన్నగురకల  రాజశేఖర్ రెడ్డి ,హరి రెడ్డి  తదితరులు పాల్గొన్నారు

Related Posts