YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిలక్క నేతృత్వంలో రాజన్న రాజ్యం తెలంగాణ లో స్థాపిస్తాం వైఎస్సార్ టీపీ నాయకులు కాముని గంగాధర్

షర్మిలక్క నేతృత్వంలో రాజన్న రాజ్యం తెలంగాణ లో స్థాపిస్తాం వైఎస్సార్ టీపీ నాయకులు కాముని గంగాధర్

షర్మిలక్క నేతృత్వంలో రాజన్న రాజ్యం తెలంగాణ లో స్థాపిస్తాం
వైఎస్సార్ టీపీ నాయకులు కాముని గంగాధర్
జగిత్యాల, సెప్టెంబర్ 14
షర్మిలక్క నేతృత్వంలో రాజన్న రాజ్యం తెలంగాణ లో స్థాపిస్తాం ఆని వైఎస్సార్ టీపీ నాయకులు కాముని గంగాధర్ ఆన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ నాయకులు కాముని గంగాధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఆనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాముని  గంగాధర్ మాట్లాడుతూ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  షర్మిల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పీడిత, బాధిత, అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న దిశగా బాధ్యతలు చేపట్టానని షర్మిల చెప్పారని అన్నారు.  ప్రజలకళ్లలో ఆనందాన్ని నిపాలన్న వైఎస్సార్  ఆశయాలను షర్మిళక్క నేతృత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సాధించు కుంటామన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా లోని ఆయా గ్రామాలనుంచి ప్రజల కదలివచ్చి జెండా ఆవిష్కరణలో పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమంలో జిల్లా నిజమాబాద్ పార్లమెంట్ సభ్యులు తిరుపతిరెడ్డి,  ధర్మపురి నియోజకవర్గ నాయకులు జాడి ప్రేమ్ సాగర్, తీగల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts