YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ సైకిల్ యాత్రలో మరో అపశ్రుతి కుప్పకూలిన ధర్మవరం ఎమ్మెల్యే

 టీడీపీ సైకిల్ యాత్రలో మరో అపశ్రుతి          కుప్పకూలిన ధర్మవరం ఎమ్మెల్యే

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బకు గురయ్యారు. మార్గమధ్యంలోనే కుప్పకూలిపోయారు.  మండుతున్న ఎండల్లో కొనసాగుతున్న ఈ యాత్రల్లో టీడీపీ నేతలు అస్వస్థతకు గురవుతున్నారు. సోమవారం ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా మార్గమధ్యంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోతకుంట గ్రామం నుంచి ధర్మవరం పట్టణానికి ఈ ఉదయం ఆయన 10 కిలోమీటర్ల యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే ఎంపీ మాగంటి బాబు కూడా సైకిల్ యాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 

Related Posts