YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గోదావరిపై అనుమతిలేని ప్రాజెక్టుల డీపీఆర్‌లను నెల లోగా అందజేయాలి

గోదావరిపై అనుమతిలేని ప్రాజెక్టుల డీపీఆర్‌లను నెల లోగా  అందజేయాలి

హైదరాబాద్‌ సెప్టెంబర్ 17
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసఘం సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని జలసౌధాలో బీపీ పాండే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ అమలుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణం, ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ భద్రతా తదితర అంశాలపై చర్చించారు. గోదావరిపై ఉన్న అనుమతిలేని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను నెల రోజుల్లోగా అందజేయాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.

Related Posts