YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్రంలో మూడు ఆధునిక జూట్‌ మిల్లుల ఏర్పాటు: కేటీఆర్‌

రాష్ట్రంలో మూడు ఆధునిక జూట్‌ మిల్లుల ఏర్పాటు: కేటీఆర్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్ 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: రాష్ట్రంలో మూడు ఆధునిక జూట్‌ మిల్లుల ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో 10 వేల 4 వందల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిపెట్టాలని సూచించారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయ ని చెప్పారు. సీఎం కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని వెల్లడించారు.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి జూట్‌ ఉత్పత్తులు ఉపయోగపడతాయని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు జూట్‌ మిల్లులు లేవన్నారు. జూట్‌ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే 20 ఏండ్లలో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ద్వారా జూట్‌ ఉత్పత్తులు కోనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో భాగంగా జూట్‌ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రం సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పదివేల ఎకరాల్లో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో జూట్‌ పరిశ్రమకు రాష్ట్రంలో మంచి డిమాండ్‌ ఉంటుందని చెప్పారు.సీఎం కేసీఆర్‌ ఇవాళ ఏం ఆలోచిస్తే రేపు దానిని దేశమంతా అనుసరిస్తుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మిషన్‌ భగీరథ పథకాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకే తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్‌ విజన్‌కు నిదర్శనమని చెప్పారు.ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడ తయారయ్యే జూట్‌ ఉత్పత్తులను రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. ఈ ఒప్పందం ప్రకారం కామారెడ్డి, వరంగల్‌, సిరిసిల్ల జిల్లాల్లో జూట్‌ మిల్లులను ఏర్పాటు చేయనున్నారు.

Related Posts