కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నర్సాపూర్ నియోజకవర్గానికి 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మంత్రి హరీష్ రావు.డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు.అలాగే నర్సాపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న లబ్ధిదారులకు 24 కోట్ల రూపాయల చెక్కులను పంపిణి చేశారు. ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం. సీసీ రోడ్లు.బటర్ ఫ్లయ్ లైటు లను ప్రారంభించారు.అనంతరం నియోజకవర్గం తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఈ నెల 9న మెదక్ లో నూతనంగా కలెక్టరేట్ భవన నిర్మాణానికి సీఎం కెసిఆర్ వస్తున్న సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే లు మదన్ రెడ్డి, చింత ప్రభాకర్, బాబు మోహన్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు.