YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గాలి సరస్వతమ్మ ఎన్నిక ఏకగ్రీవం

గాలి సరస్వతమ్మ ఎన్నిక ఏకగ్రీవం

టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతితో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడం కోసం నిర్వహిస్తున్న చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. గాలి ముద్దుకృష్ణమ భార్య సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నిమైనట్టు చిత్తురు జాయింట్ కలెక్టర్ గిరిష ప్రకటించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎం.మస్తాన్రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థి గాలి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టయింది.  అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ తో మోగియడంతో అధికారికంగా ఆమె ఎన్నికను జేసీ ప్రకటించారు.  జిల్లాలో ఓటర్లపరంగా టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత వున్నందున వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏకగ్రీవానికి సహకరించిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు ,గాలి ముద్దుకృష్ణమనాయుడి ఆశయాలను నెరవేరుస్తాను , టిడిపి పార్టీకి విధేయురాలిగా ఉంటానని  గాలి సరస్వతమ్మ అన్నారు. సరస్వతమ్మ తో పాటు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ శివప్రసాద్ , జెడ్పి చైర్మెన్ గీర్వాణి ,టిడిపి జిల్లా అధ్యక్షులు పులివర్తినాని , ఎం ఎల్ సి దొరబాబు , మేయర్ హేమలత వచ్చారు.

Related Posts