సివిల్ టాపర్ అనుదీప్ ను సోమవారం నాడు లంచ్ కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అతడితో కలిసి భోజనం చేశారు. జాతీయ స్థాయిలో సివిల్స్ లో తెలంగాణ బిడ్డ మొదటి స్థానంలో గెలవడం రాష్ట్రానికే గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు. అనుదీప్ ను అతడి తల్లిదండ్రులను లంచ్ కు ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో వారితో కలిసి భోజనం చేసిన కేసీఆర్ అనుదీప్ ను అభినందించి ఆశీర్వదించారు యువతకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చనడానికి అనుదీపే నిదర్శనమని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఎంపీలు కవిత, సుమన్, విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.