YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం - ఎమ్మెల్యే దానం నాగేందర్

పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం - ఎమ్మెల్యే దానం నాగేందర్

పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం
- ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్
టిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో డివిజన్ల వారీగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం సోమాజిగూడ డివిజన్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ఐదు రకాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోర్ కమిటీ, వార్డ్ కమిటీ, మహిళా కమిటీ, యువజన కమిటీ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించారు. డివిజన్ పరిధిలోని సమగ్ర విషయాలు ఈ కమిటీలు ఎప్పటికప్పుడు కోర్ కమిటీ దృష్టికి తీసుకు వస్తే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేసి పక్షులను పరిష్కారమయ్యేలా తోడ్పడతాయని అన్నారు. వీటి ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం మేడం తో పాటు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు సైతం అభివృద్ధి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని కాలనీ లతోపాటు బస్తీలు అభివృద్ధి సాధించేలా తోడ్పాటు అందించాలని కోరారు. కమిటీలు నిష్పక్షపాతంగా పని చేస్తూ ప్రతి ఇంటికి పార్టీ కార్యక్రమాలను చేరవేయాలని సూచించారు.  పార్టీ సభ్యత్వాన్ని ఇంత పెంచాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి డివిజన్ల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తామని, మూడు నెలలకోసారి నియోజకవర్గ స్థాయిలో సమావేశాన్ని నిర్వహించి  సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Related Posts