YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కదిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ చలానాలు

కదిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ చలానాలు

అనంతపురం
కదిరి సబ్ రిజిస్ట్రార్  కార్యాలయంలో నకిలీ చలానాలు కలకలం రేపాయి.   44 డాక్యుమెంట్లకు సంబంధించి నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు  వెలుగు చూసింది.  రూ. 21 లక్షల వరకు స్వాహా చేసినట్లు తేలిందని ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. సమగ్ర నివేదిక అందజేయాలని ఆ శాఖ డీఐజీ మాధవి.. హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ ఉమాదేవిని అదేశించారు.  నివేదిక రాగానే.. నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.  2018-19 మధ్యలో ఈ వ్యవహారం సాగిందని తెలిసింది.   ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేవుతున్నాయి.. ఇప్పుడు కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఆలస్యంగా వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది..

Related Posts