YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఢిల్లీ న్యాయస్థానం ఆవరణలో దారుణ లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులు నలుగురు మృతి

ఢిల్లీ న్యాయస్థానం ఆవరణలో దారుణ లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులు నలుగురు మృతి

ఢిల్లీ న్యాయస్థానం ఆవరణలో దారుణ
లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులు నలుగురు మృతి
న్యూఢిల్లీ సెప్టెంబర్ 24
ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో  ఓ గ్యాంగ్‌ లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్‌ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్‌ దుస్తుల్లో వచ్చిన సునీల్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర మృతి చెందాడు.ఓ కేసు విషయంలో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర కోర్టు రాగా లాయర్‌ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్‌.  కాగా, ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు.  అందరు చూస్తుండగానే ఇరు గ్యాంగ్‌లు విచ్చల విడిగా కాల్పులు జరుపుకున్నాయి.  కొంతకాలంగా సునీల్‌ గ్యాంగ్‌-జితేంద్ర గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్‌ చేసుకున్న సునీల్‌ గ్యాంగ్‌.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది. జితేంద్ర గోగి అలియాస్‌ దాదా మోస్గ్‌ వాంటెడ్‌ క్రిమినల్‌.

Related Posts