YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రౌడీ షీటర్ దారుణ హత్య

రౌడీ షీటర్ దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 
నగరంలో బ్లడ్ బ్యాచి లకు రౌడీ షీటర్ మధ్య జరుగుతున్న ఆధిపత్య  పోరు లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పనస చెట్టు ఏరియా వద్ద ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.  దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో  సి టి ఆర్ ఐ. పరిధిలో నివాసం ఉంటున్న దొంగ రెడ్డి( 28 ) అనే రౌడీ షీటర్ కు అతని ప్రత్యర్ధులు. బ్లేడ్ బ్యాచ్ షూటర్ సాయి, రౌడీషీటర్ లక్ష్మణ్ మరో ఇద్దరు తో పాత కక్షలు ఉన్నాయని తెలుస్తుంది ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అదేవిధంగా శుక్రవారం రాత్రి కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగాయని తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు నట్లు స్థానికులు సమాచారం మద్యం మత్తులో ఉన్న షూటర్ సాయి అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత  మేడ పై పడుకున్నా దొంగ రెడ్డి ని నిద్రలేపి వెంట తెచ్చుకున్న మారణాయుదంతో విచక్షణా రహితంగా నరికి వేయడంతో అక్కడ అక్కడ రౌడీ షీటర్ దొంగ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలాడు జరిగిన సంఘటన పై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు దీనిపై మూడో పట్టణ సీఐ మధు బాబు మాట్లాడుతూ నిందితుల కోసం గాలిస్తున్నామని ఇరువర్గాల మధ్య పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఈ దారుణ హత్య జరిగిందన్నారు.  నేరాలు-ఘోరాలు ఎన్నో జరుగుతున్న అప్పటికి అదుపులోకి తీసుకు రాలేక పోతున్నారని  అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయిని నగర ప్రజలు వాపోతున్నారు.

Related Posts