YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పరిగిలో బంద్…బస్సులు ఆపివేత

పరిగిలో బంద్…బస్సులు ఆపివేత

వికారాబాద్
వికారాబాద్ జిల్లా పరిగి వామపక్ష పిలుపుమేరకు  పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ను బస్ డిపోను ముట్టడించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు వామపక్ష నేతలు. వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతుల సమస్యలను పరిష్కరించాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వామపక్ష నాయకులతో కలిసి బస్ డిపో ముందు బస్సులు బయటకు వెళ్లకుండా వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వామపక్ష నాయకులు పాల్గొన్నారు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇరుక్కుపోయిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్ డిపో ముందు, బస్టాండ్ ముందు పోలీసులు భారీగా మొహరించారు.  ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Related Posts