YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీఎం పర్యటనపై మంత్రి ఈటల సమీక్ష

సీఎం పర్యటనపై మంత్రి ఈటల సమీక్ష

ఈ నెల 10వ తీదీన హుజురాబాద్ లో జరిగే సీఎం సభ ఏర్పాట్లపై కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించిన ఆర్థిక మంత్రి ఈటల. ఎంపీ వినోద్, ఐడీసీ చైర్మన్, కలెక్టర్ తో పాటు అన్ని శాఖల ఉన్నత అధికారులు హాజరు అయ్యారు. 

కరీంనగర్ కెసిఆర్ కి సెంటిమెంట్ ఉన్న జిల్లా. ఇక్కడినుండి ప్రారంభించిన ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యింది. దేశంలోనే మొదటి సారిగా ప్రవేశపెడుతున్న రైతుబంధు కూడా విజయవంతం కానుంది. దేశ రైతులందరికీ కూడా ఇలాంటి పథకాలు అవసరం. జాతీయ వేదికలమీద కూడా ఈ పథకాన్ని ప్రస్తావిస్తాం.  సీఎం  మీటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరీంనగర్ నుండి హుజురాబాద్ వరకు ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాం. ఎండాకాలం కావడంతో వచ్చే రైతులు ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాం. మాది రైతు ప్రభుత్వం. మా మొదటి ప్రాధాన్యత వ్యవసాయం. కోటి ఎకరాలకు నీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకున్న అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు. గోదావరి మీద కట్టే ప్రాజెక్టులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కరువంటే ఏంటో తెలియకుండా చేస్తాం. కరీంనగర్ కోనసీమ కంటే గొప్పగా తయారుకానుంది. అధికారులందరూ సీఎం సమావేశం కోసం సమన్వాయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరుతున్న అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

Related Posts