YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్ లేఖలోని ఆంశాలను ఖండించిన తెరాస నేతలు

బండి సంజయ్ లేఖలోని ఆంశాలను ఖండించిన తెరాస నేతలు

బండి సంజయ్ లేఖలోని ఆంశాలను ఖండించిన తెరాస నేతలు
హైదరాబాద్
ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మంగళవారం నాడు టి ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ బీజేపీ బండి సంజయ్ ఓ లేఖ రాశారు ..అందులోని అంశాలు ఖండిస్తున్నాం. బీజేపీ కి బండి సంజయ్ గుదిబండ అని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పాద యాత్ర కు స్పందన లేకే బండి బెకార్ మాటలు మాట్లాడుతున్నారు. బురదలో పొర్లే పందికి పన్నీరు వాసన ఎలా తెలుస్తుంది ? బడా జూటా బండి సంజయ్ కు ప్రగతి భవన్ పనితనం ఎలా తెలుస్తుంది ? ఉద్యమానికి తెలంగాణ భవన్ ఊపిరి లూదితే ..ప్రగతి భవన్ తెలంగాణ బతుకు గతి ని మార్చింది. అన్ని గొప్ప సాగునీటి ప్రాజెక్టులకు పురుడు పోసింది ప్రగతి భవన్. ప్రగతి భవన్ ఓ భవనం కాదు తెలంగాణ సకల జనుల సంక్షేమ భవన్. కెసిఆర్ కు నాలుగు కోట్ల ప్రజల అభిమానమే ఆస్తి ..వేరే ఆస్తులు లేవు. .తెలంగాణ ప్రజలను బికారి లు గా మార్చారు అన్న వ్యాఖ్యలు బండి సంజయ్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు.
వినాయక నిమజ్జనం ముగిసింది ..ఇక ప్రతిపక్షాల నిమజ్జనమే మిగిలి ఉంది. కేంద్రం తెలంగాణ ను పార్లమెంటు లో ప్రతీ సందర్భంలో కొనియాడుతోంది. పార్టీల ప్రలోభాల గురించి బండి సంజయ్ మాట్లాడటమా ? ప్రభుత్వాలను రాత్రికి రాత్రే తారు మారు చేసిన ఘనత బీజేపీ ది కాదా ? కడిగిన ముత్యానికి కూడా మారకాలుంటాయేమో కానీ మా పాలన కు మరక లేదు. నీతి ఆయోగ్ ,rbi ఇచ్చిన నివేదికలే తెలంగాణ ఘనత చాటాయి. చదువు రాని సన్నాసి బండి సంజయ్ కు ఇవి చెవినెక్కుతాయా ? వంట గదిని మోడీ మంటo గదిగా మార్చారు. వంటగదిలో అన్ని వస్తువులనుపైగా చిన ఘనత మోడీ దే. 110 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన మోడీ దేశానికి చేసిందేమి లేదు. 100 కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన ఘనత మోడీ ది. అన్నిటిని అమ్మేసి తెలంగాణ కు శఠగోపం పెట్టిన కేంద్రాన్ని ప్రశ్నించని సన్నాసులు నలుగురు బీజేపీ ఎంపీ లు. .రాత్రి వంద పురుగులు తిని ఉదయం దేవుడి ఫొటో వెనక దాక్కున్న బల్లి లా ఉంది బీజేపీ తీరు.  అరెక్ మాల్ ఫర్ సేల్ నినాధంలో బీజేపీ దూసుకుపోతోంది.  మోడీ పాలనలో 8లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చెయ్యలేదు!.  మోడీ క్రేజ్ 42శాతం దేశంలో పడిపోయింది.  ఒడ్లు కొననంటున్న విషయంపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?  టీఆరెస్ ప్రభుత్వంపై విమర్శలు- పాదయాత్రలు కట్టిపెట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై పోరాటం చెయ్యాలని అన్నారు.
ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కి లేఖ రాయాలంటే ఒక అర్హత ఉండాలి- ఆ అర్హత బండి సంజయ్ కి లేదు.  కరీంనగర్ ఎంపీగా గెలిచి బండి సంజయ్ చేసిన పనేంటో చెప్పాలి.  ఎంపీగా ఉండి ఒక్క కోటి రూపాయల పని చెయ్యలేదు.  బండి సంజయ్ ఆడోళ్లు ఏడ్చినట్లు ఏడిస్తే ప్రజలు ఓట్లు వేశారు.  కోచ్ ఫ్యాక్టరీ తరలిపోతుంటే ఉత్సవ విగ్రహంగా సంజయ్ చూస్తూ ఉన్నారు.  కొబ్బరికాయ జుట్టు తీస్తే ఎట్లా ఉంటాదో సంజయ్ మొఖం అట్లా ఉంటది.   బండి సంజయ్ టీఆరెస్ పార్టీ లెక్కల గుమస్తా లాగా ఆస్తుల లెక్కలు అడుగుతావా?దానికో పద్ధతి ఉంది కాగ్ చూసుకుంటారు.  ఎన్నికల అనంతరం కేసీఆర్ ని అడిగి గుమస్తా ఉద్యోగం ఇప్పిస్తామని అన్నారు.
ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు మాట్లాడుతూ బండి సంజయ్ యాత్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు ...అదో తీర్థ యాత్ర సాగినట్టు గా ఉంది. ప్రజలు ఎక్కడా సమస్యలు చెప్పకపోగా ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నారు. నెల రోజులవుతోంది ఈ యాత్ర మొదలు పెట్టి ..ఒక్క రోజైనా మోడీ ఫలానా గొప్ప పని చేశాడు అని బండి సంజయ్ చెప్పాడు. బండి నోరు విప్పితే అన్నీ అబద్దాలే. కెసిఆర్ ను తిడితే హీరోలు కారు జీరోలు అవుతారని చరిత్ర చెబుతోంది. కరీం నగర్ లో ఓ డివిజన్ గురించి తప్ప బండి కి తెలంగాణ గురించి తెలియదు. బండి ఢిల్లీ కి పాదయాత్ర చేయాలి. బూతులు తప్ప ఏవీ రాని బండి శ్రీరంగ నీతులు చెబితే జనం నమ్ముతారా. మీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ లో ktr పనితీరు ను నిన్ననే పొగిడారు ..అంతకు ముందు పదుల సంఖ్యలో బీజేపీ కేంద్రమంత్రులు పొగిడారు. నీకు నెత్తి లేదు కత్తి లేదు మాటల్లో నత్తి సుత్తి మాత్రం ఉన్నాయి. బండి ఉత్తుత్తి ,నత్తి మాటలకు ఉట్లు తెగేది లేదు. .బండి సంజయ్ వి పిచ్చి మాటలు తప్ప పనికొచ్చే మాటలు కావని విమర్శించారు.

Related Posts