YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

జైలులో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ 24 మంది ఖైదీలు మృతి

జైలులో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ 24 మంది ఖైదీలు మృతి

 జైలులో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ 24 మంది ఖైదీలు మృతి
న్యూ డిల్లీ సెప్టెంబర్ 29
ఈక్వెడార్‌లోని గుయాక్విల్ జైలులో రెండు వర్గాల మధ్య ఘర్షణ 24 మంది మృతి కి దారితీసింది. జైలులో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన వివాదం తో బాంబులు, తుపాకులతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో 24 మంది ఖైదీలు మృతిచెందారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 24 మంది ఖైదీలు మృతి చెందారు. మరో 48 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.రంగంలోకి దిగిన సైనికులు, పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. కాగా ఈక్వెడార్‌లోని మూడు జైళ్లలో గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షనల్లో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు.

Related Posts