బండి సంజయ్ సంకల్ప యాత్రకు భారీగా బయలుదేరిన పెద్దపల్లి బీజేపీ శ్రేణులు
పెద్దపల్లి
బిజెపి రాష్ట్ర రథసారథి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంకల్ప యాత్ర కు మద్దతుగా పెద్దపెల్లి జిల్లా నుండి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ నేతృత్వంలో వేల సంఖ్యలో తరలి వెళ్లారు. ప్రదీప్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నట్లుగా పేరు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు చేరువ చేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో మరియు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తిగా పార్లమెంటు సభ్యులను గెలుచుకునే విధంగా గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు అలాగే దుగ్యాల ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో పెద్దపెళ్లి అసెంబ్లీ కోట పై జెండా ఎగరేసి తెలంగాణ రాష్ట్రలో ప్రభుత్వన్ని ఏర్పాటు చేస్తామని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తంగెడ రాజేశ్వరరావు, శిలారపు పర్వతాలు, తాత రవి,పొల్సాని సంపత్ రావు,గనబోయిన రాజేందర్,అమరగాని ప్రదీప్,దాడి సంతోష్,ఎర్రోళ్ల శ్రీకాంత్,మహంత కృష్ణ,సిలివేరు మధు,గుడిపటి సంతోష్ రెడ్డి ,అరెపల్లి రాహుల్,సురేష్, విశ్వాస్, కృష్ణ, సంపత్, శ్రీనివాస్రెడ్డి, అజయ్ పలువురు పాల్గొన్నారు