YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందరూ తోడుగా నిలవాలి మంత్రి దేవినేని ఉమ

 ముఖ్యమంత్రి  చంద్రబాబు కు అందరూ తోడుగా నిలవాలి మంత్రి దేవినేని ఉమ

కృష్ణా జిల్లా జి.కొండూరుకు  మండలానికి చెందిన వైసీపీ మరియు వివిధ పార్టీలకు చెందిన దాదాపు 50మంది కార్యకర్తలు మండల టీడీపీ అధ్యక్షుడు ఉయ్యూరు నరసింహారావు నేతృత్వంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలో ఈ రోజు ఉదయం జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో టీడీపీలో చేరారు. రాష్ట్ర అభివృద్ధికి కలిసివచ్చే వారందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నామని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి అందరూ తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని మంత్రి  ఉమ అన్నారు. పార్టీలో చేరిన వారిలో మండల వైసీపీ నాయకులు వ్యాపారవేత్త అయిన పజ్జారు నాగమల్లేశ్వరరావు, వినయ్ కుమార్, రాజా, వెంకటేశ్వరరావు, పొందుగుల నరేంద్ర, రవిబాబు, జవ్వాది సాంబశివరావు, తలుపులేటి కొండారెడ్డి, పొందూరు నరేంద్ర, బొర్రా చంద్రశేఖర్, చిన్న రమేష్ యాదవ్ తదితరులున్నారు. మంత్రి ఉమ అందరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు స్థానికి శాసనసభ్యులు మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గార్లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారు కూడా దీనిలో భాగస్వాములు కావాలనే తెదేపా తీర్ధం పుచ్చుకున్నట్లు సభ్యులు తెలిపారు

Related Posts