YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ భూములు తాకట్టు పై మాజీమంత్రి అయ్యన్న

విశాఖ భూములు తాకట్టు పై మాజీమంత్రి అయ్యన్న

విశాఖపట్నం
విశాఖపట్నంలోని  ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం బాధాకరమని మాజీమంత్రి  అయ్యన్న పాత్రుడు అన్నారు.  ప్రభుత్వ కార్యాలయాలు  ప్రజల ఆస్థులు, తాకట్టు పెట్టడానికి వీళ్లకున్న అధికారం ఏంటి.  ఇది ఒక తుగ్లక్ నిర్ణయమని విమర్శించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటికే ఏ2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచుకుంటున్నారు.  ప్రభుత్వ ఐటిఐ కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, సర్కూట్ హౌస్, తహశీల్దార్ కార్యాలయం, గోపాలపట్నం రైతు బజార్, పోలీసు క్వాటర్స్ ఇలా 13 విలువైన ప్రజల ఆస్తులను 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారు.  కోర్టులో భూముల అమ్మకం కేసు పెండింగ్ ఉండగానే. ఈ మూర్ఖులు తాకట్టు పెట్టేసారు. మన మూడు జిల్లాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు మీరు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఇది మంచి నిర్ణయమా...? కొంత మంది దొంగలు  ఎక్కడెక్కడ నుండో వచ్చి మన ప్రాతంలో దోపిడీ చేస్తుంటే మనం చోద్యం ఊరుకోవాల్సిందేనా..  వాళ్ళు మరో 2 సంవత్సరాల తరువాత పోతారు, కానీ నష్టపోయేది మన ప్రాంత ప్రజలు.  పార్టీలకు అతీతంగా మన ప్రాంత ఆస్తులను కాపాడుకోవలసిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని అయన అన్నారు.

Related Posts