YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మానేరు థీమ్ పార్క్ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటల

మానేరు థీమ్ పార్క్ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటల

కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. గుజరాత్లోని సబర్మతీ తీరం తరహాలో  కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామనీ అయన అన్నారు.  అలాగే సస్పెన్షన్ బ్రిడ్జ్, మరోవైపు థీమ్ పార్కులు కరీంనగర్కు ప్రధానాకర్షణగా నిలువనున్నట్టు తెలిపారాయన.  ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. రూ 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హరితహోటల్, మానేరు వద్ద ఏర్పాటు చేయనున్న థీమ్పార్క్కు  కుడా మంత్రి శంకుస్థాపన చేశారు. వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం వంటి ప్రఖ్యాత క్షేత్రాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పటికే టెంపుల్  టౌన్ గా అందరికీ సుపరిచితం. ఈ నేపధ్యంలో  రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలిపారు. 500 కోట్ల రూపాయలతో మానేరు రివర్  ఫ్రంట్  ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

Related Posts